చెన్నై: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చెన్నై నగరంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. నగరంలోని పురసైవాక్కంలో కార్యాలయాన్ని తెరిచారు. చెన్నై కార్యాలయం తొలి సూపరింటెండెంట్గా అసోం రాష్ట్రానికి చెందిన శ్రీజిత్ నియమితులయ్యారు. దక్షిణ భారతదేశంలో తీవ్రవాదుల కదలికలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ మధ్య సుమారుగా 50కి పైగా తీవ్రవాదులను గుర్తించి ఎన్ఐఏ అరెస్టు చేసింది. అదేవిధంగా పలువురు ఐసిస్ సానుభూతిపరులను కూడా ఎన్ఐఏ గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు వీలుగా ఎన్ఐఏ తన ప్రాంతీయ కార్యాలయాన్ని చెన్నైలో ఏర్పాటుచేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
అదరగొట్టే ఫీచర్స్తో నోకియా 5జీ స్మార్ట్ఫోన్..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?