న్యూఢిల్లీ: డ్రోన్ల వినియోగాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తప్పని సరి చేసింది. జాతీయ రహదారి ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ వంటి అన్ని దశలను నెలవారీగా డ్రోన్లతో వీడియో రికార్డింగ్ చేస్తారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయించింది. ప్రాజెక్టు పనుల పురోగతిపై డ్రోన్లతో నెలవారీ వీడియో రికార్డింగ్ను తప్పని సరి చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.