చెన్నారావుపేట, మే 24 : వైద్యుల సూచనల మేరకు కరోనా బాధితులు హోం ఐసొలేషన్లో ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికకారులు కోరారు. చెన్నారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఈర్యతండాలో కరోనా బాధితులకు సోమవారం సర్పంచ్ కుండె మల్లయ్య నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పెసరపప్పు, కిలో వంటనూనె, కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లలిత, మెడికల్ ఆఫీసర్ ఉషారాణి, ఎస్సై శీలం రవి, ఎంపీవో గౌడ సురేశ్, కార్యదర్శి బాలకిషన్గౌడ్, వార్డు సభ్యుడు జున్నూతుల శ్రీధర్రెడ్డి, నాయకులు కందిక సునీల్, కుసుమ నరేందర్, మహ్మద్ రఫీ, వైద్య సిబ్బంది అరుణ, ఆశ కార్యకర్త విజయ పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం : మండలంలోని రాగంపేటలో కరోనా బాధిత కుటుంబాలకు సర్పంచ్ భాషబోయిన ఐలయ్య సోమవారం నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వరుణ్, వీఆర్వో భారతి, ఆశ కార్యకర్త సంధ్యపాల్గొన్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు : మండల కేంద్రంలోని కరోనా బాధితులకు సర్పంచ్ పర్వతగిరి రాజు తనవంతు చేయూతనందిస్తున్నా రు. స్థానిక సెయింట్ థెరిస్సా ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ కరోనా బాధితులకు ఉదయం, సాయంత్రం భోజ నం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్గౌడ్, మాజీ ఎంపీటీసీ పరికిరాల వాసు, పీఏసీఎస్ డైరెక్టర్లు రేవూరి జయపాల్రెడ్డి, వీర్ల వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, బిల్కలెక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సంగెంలో..
సంగెం : మండలంలోని ఎల్గూర్రంగంపేటలో సోమవారం కరోనా బాధితులకు యువసంకల్ప ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులతోపాటు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు శాబోతు ఉమ, శ్రీనివాస్, ఎంపీటీసీ పద్మశ్రీనివాస్, ఎన్జీవో సంస్థ వ్యవస్థాపకుడు మండల పరమేశ్, కార్యదర్శి చింతల రాజు, ఉపాధ్యక్షుడు మండల శ్రీనివాస్, పోశాల సతీశ్, ఇమ్మడి ఆరోగ్యం, పసునూటి అశోక్, శ్రవణ్, ఇమ్మడి సుమన్, బోనాల శ్రీనివాస్, ఉప్పలయ్య పాల్గొన్నారు.