9న రైతు నేతలతో మరో విడత కేంద్రం చర్చలు

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న మరో విడత చర్చలు జరుపనున్నది. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి లేదు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తుండగా సవరణలకు కేంద్రం మొగ్గుచూపుతున్నది. ఈ నేపథ్యంలో చర్చల్లో అనిశ్చితి కొనసాగుతున్నది. ఒక ప్రతిపాదనను పంపుతామని కేంద్ర ప్రభుత్వం తమకు తెలిపిందని చర్చల అనంతరం రైతు సంఘాల నేతలు చెప్పారు. ఆ ప్రతిపాదనపై తమతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన తర్వాత ఈ నెల 9న ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించిందని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరపైనా చర్చ జరిగిందని, అయితే చట్టాలను వెనక్కి తీసుకునే అంశంపై మాట్లాడాలని తాము చెప్పినట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికైత్ తెలిపారు. ప్రకటించిన మాదిరిగానే ఈ నెల 8న భారత్ బంద్ ఉంటుందని అన్నారు.
తాజావార్తలు
- ఇల్లు ఎక్కడ కొనాలో చెప్పండి: రిషబ్ పంత్
- రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం..
- ‘రక్షణ పరికరాల తయారీలో బలీయ శక్తిగా భారత్’
- కరీం‘నగరం’లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి : మంత్రి గంగుల
- కొవిడ్ నిబంధనలు కాదన్నందుకు భారీ జరిమానా
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకందారులకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!
- పాలనలో పారదర్శకత కోసమే ప్రజావేదిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
- వుహాన్లో డబ్ల్యూహెచ్వో బృందం.. ముగిసిన క్వారెంటైన్