ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాల జిల్లా దవాఖానకు ఆక్సిజన్ కాన్సట్రేటర్ అందజేత
జగిత్యాల విద్యానగర్, జూన్ 11: జిల్లా దవాఖానకు ఆక్సిజన్ కాన్సట్రేటర్ను అందజేయడం అభినందనీయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కొనియాడారు. జగిత్యాలకు చెందిన నలంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేశ్ జర్మనీలోని ఫ్రాంక్ ఫర్డ్ పట్టణ తెలుగు వెలుగు జర్మనీ అసోసియేషన్ సౌజన్యంతో పది లీట్లర సామర్థ్యం గల (రూ.1.40లక్షల విలువ చేసే) ఆక్సిజన్ కాన్సట్రేటర్ను ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్కుమార్ చేతుల మీదుగా జిల్లా దవాఖానలోని పిల్లల విభాగానికి శుక్రవారం అందజేశారు. తెలుగు వెలుగు జర్మనీ అధ్యక్షుడు దాసరి సాయిరెడ్డి, కార్యదర్శి వెలగ సూర్యప్రకాశ్, కోశాధికారి వంగల ఆదర్మమూర్తి, ఆక్సిజన్ కాన్సట్రేటర్ను అందించడంలో భాగస్వాములైన కరస్పాండెంట్ శ్రీపాద నరేశ్ను అభినందించారు. ఇక్కడ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సుదక్షిణాదేవి, ఆర్ఎంవో డాక్టర్ రామకృష్ణ, పిల్లల వైద్య నిపుణులు డా భీమేశ్, కౌన్సిలర్లు ముస్కు నారాయణరెడ్డి, లతానర్సింగరావు, పద్మశాలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చెట్పెల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.