వేంకటేశ్వరస్వామికి పట్టు వస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
బొంరాస్పేట, మార్చి16 : కొడంగల్ పట్టణంలో శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. స్వామివారిని అలంకరించి మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్ర్తాలను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి స్వామివారికి సమర్పించారు
కొ డంగల్ పట్టణంలో జరుగుతున్న శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు దేవాల య కమిటి, మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు క ల్పించామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్ర్తాలను స్వామివారికి ఎమ్మెల్యే సమర్పించి పూజలు చేశారు. ఎమ్మెల్యేకు అర్చకులు తీర్థ ప్రసాదాలతో పాటు వెంకన్న చిత్ర పటాన్ని బహూకరించారు.అనంతరం జాతర మైదానంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ విద్యుత్ దీపాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైభవంగా జరిగే వెంకన్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని వారికి ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, కౌన్సిలర్ మధుయాదవ్, జడ్పీటీసీ నాగరాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఐదో రోజు స్వామి వారిని అలంకరించి పల్లకీ సేవ నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించే లంకాదహనానికి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు.