రోజు రోజుకు కొవిడ్ రోగుల సంఖ్య నగరంలో విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్రంలోనూ వీరి సం ఖ్య పెరుగుతున్న కొద్దీ కొవిడ్ వ్యాధిగ్రస్తుల వల్ల బయో వ్యర్థాలు అధికంగా ఉత్పన్నమవుతున్నా యి. ఈ క్రమంలోనే నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేల టన్నుల బయో వ్యర్థాలు కామన్ బయోవేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. కాని, దవాఖానలలో, ఐసోలేషన్ వార్డులలో, హోం ఐసోలేషన్ వార్డుల నుంచి ఉత్పత్తి అయిన బయోవేస్ట్ను సక్రమంగా నిర్వహించకుంటే ఇబ్బందులు తప్పవని వైద్య నిఫుణులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, కొవిడ్ వ్యాధిగ్రస్తుల నుంచి వెలువడిన వ్యర్థాలను సీపీసీబీ నిబంధనల ప్రకారం నిర్వహించకుంటే తీవ్రమైన దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఎలాంటి బయో వ్యర్థాలను ఏఏ రంగు డబ్బాలలో వేయాలనే అంశంపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
సీపీసీబీ సూచనల మేరకు ప్రతి దవాఖానలో, ప్రతి ఐసోలేషన్ వార్డులో సుమారు నాలుగు రకాల రంగు డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీసీబీ జారీ చేసిన కొవిడ్-19 బయోవేస్ట్ మార్గదర్శకాలలో స్పష్టం చేసింది. పసుపు, ఎరుపు, నీలి, తెలుపు రంగు డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఎరుపు, పసుపు రంగులున్న డబ్బాలలో 50 మైక్రాన్ల కన్నా ఎక్కువ మందమున్న నాన్ క్లోరినేటెడ్ ఆయా రంగుల క్లోరినేటెడ్ బ్యాగులను వాడాలి.