ఢిల్లీ,జూన్ 11: గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు కేంద్ర రవాణాశాఖ తప్పనిసరి నియమావళిని జారీ చేసింది. ఈ నియమ నిబంధనలు జులై 1వతేదీ నుంచి అమలులోకి వస్తాయి. అటువంటి కేంద్రాలలో నమోదు చేసుకునే అభ్యర్ధులకు సరైన శిక్షణను అందించేందుకు ఇది తోడ్పడుతుంది. గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు జారీ చేసిన నియిమాలలో ప్రముఖ అంశాలు…
-అభ్యర్ధులకు అత్యున్నత నాణ్యత కలిగిన శిక్షణను అందించేందుకు కేంద్రాలకు సిమ్యులేటర్లు, డేడికేటెడ్ డ్రైవింగ్ ట్రాకులను కల్పిస్తారు.
-మోటార్ వాహనాల చట్టం, 1988 కింద అవసరమైనకోర్సులు ఈ కేంద్రాలలో పొందవచ్చు.
-ఈ పరీక్షా కేంద్రాలలో విజయవంతంగా పాసైన అభ్యర్ధులకు డ్రైవింగ్ లైసెన్స్కు దాఖలు చేసుకున్న సమయంలో ప్రస్తుతం ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఒ) నిర్వహిస్తున్న డ్రైవింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుంది.
-అటువంటి గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రాల నుంచి శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ పొందిందేందుకు అవకాశం ఉంటుంది.
-ఈ కేంద్రాలను పరిశ్రమలకు నిర్ధిష్ట ప్రత్యేక శిక్షణలను నిర్వహించేందుకు కూడా అనుమతిస్తారు.
-నైపుణ్యం కలిగిన డ్రైవర్ల కొరత పెద్ద సమస్యగా ఉంది. రహదారి నియమాల పట్ల అవగాహన లేమి కారణంగా పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.
-గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు నియమ నిబంధనలను తయారు చేసి, జారీ చేసేందుకు మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019లోని సెక్షన్ 8 అధికారాన్ని ఇస్తుంది.