భువనేశ్వర్: న్యూ జెనరేషన్ ఆకాష్ క్షిపణి (ఆకాష్-ఎన్జీ)ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) బుధవారం పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుంచి చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైందని డీఆర్డీవో తెలిపింది. లక్ష్య ప్రమాణాల మేరకు టెస్ట్ జరిగినట్లు పేర్కొంది.
మరోవైపు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఆర్మీని బలోపేతం చేసేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన తక్కువ బరువున్న మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని డీఆర్డీవో బుధవారం విజయవంతంగా పరీక్షించింది. థర్మల్ సైట్తో అనుసంధానించిన మ్యాన్-పోర్టబుల్ లాంచర్ నుండి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు డీఆర్డీవో తెలిపింది. ట్యాంక్ నమూనా లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో నాశనం చేసిందని, కనీస పరిధి పరీక్ష విజయవంతమైందని, మిషన్ లక్ష్యాలన్నీ నెరవేరాయని వెల్లడించింది.
మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ఇప్పటికే గరిష్ట శ్రేణి కోసం విజయవంతంగా టెస్ట్ చేసినట్లు డీఆర్డీవో వివరించింది. అధునాతన ఏవియానిక్స్తో పాటు అత్యాధునిక మినిటరైజ్డ్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్తో ఈ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది.