ముంబైలో నైట్ కర్ఫ్యూ.. బ్రిటన్ ‘కరోనా’ స్ట్రెయిన్’ ఎఫెక్ట్

ముంబై: బ్రిటన్లో కరోనా నూతన స్ట్రెయిన్ జూలు విదల్చడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. అలాగే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రివేళ కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ వచ్చేనెల 5వ తేదీ వరకు అమలులో ఉంటుందని ప్రకటించింది. ముంబై నగర పాలక సంస్థ పరిధిలో ఈ కర్ఫ్యూ అమలు చేస్తామని తెలిపింది. మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ మొదలవుతుందని వివరించింది.
యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు మంగళవారం నుంచి తప్పనిసరి సంస్థాగత క్వారంటైన్కు వెళ్లాలని స్పష్టం చేసింది. ఆదివారం నాడే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రంలో కరోనాను నియంత్రించడానికి రాత్రి కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని ప్రకటించడం గమనార్హం. మహారాష్ట్రలోనూ, దాని రాజధాని ముంబైలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్
- నిమ్మగడ్డ బెదిరింపులకు భయపడేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- దేశంలో 165కు చేరిన కొత్త రకం కరోనా కేసులు