వైకుంఠధామం ఏర్పాటుతో తీరిన సమస్య
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
అభివృద్ధి పథంలో కొంకల గ్రామం
వడ్డేపల్లి, ఏప్రిల్ 7 : పల్లెప్రగతితో గ్రామాల రూ పురేఖలు మారుతున్నాయి. ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణాలు, డం పింగ్ యార్డులు, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు, వైకుంఠధామ నిర్మాణం, అందమైన రోడ్లు, రైతువేదికల ఏర్పాటు ఇలా అనేక అభివృద్ధి పనులు దర్శనమిస్తున్నాయి. పల్లెలు నూతన శోభ సంతరించుకుంటున్నాయి. గ్రామాల్లో మునుపెన్నడూ లేని వి ధంగా అభివృద్ధి జరుగుతుండడంతో పట్టణాలకు వలస వెళ్లిన వారంతా తిరిగి వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతిని సద్వినియోగం చేసుకొని జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మం డలం కొంకల గ్రామం మండలానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
కొంకల గ్రామంలో గతంలో ఎవరైనా చనిపోతే పూడ్చేందుకు జాగ కూడా ఉండేది కాదు.. ఒకరు మరణించిన రెండ్రోజలు తరువాత మరొకరు చనిపోతే అదే స్థలంలో గుంత తవ్వి పూడ్చాల్సిన పరిస్థితి దాపురించేది.
కానీ నేడు వైకుంఠధామం ఏర్పాటుతో ఆ కష్టాలన్నీ తీరాయి. రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లమీద కల్లాలు వేసేవారు. దీంతో ఎ న్నో ప్రమాదాలు జరిగేవి. కానీ నేడు రైతుల స్థలాల్లోనే విశాలమైన కల్లాలు ఏర్పాటయ్యాయి. అంగన్వాడీ నిర్వహణకు సొంత భవనం లేక పాఠశాల ఆవరణలోనో, అద్దె గృహాల్లోనో నడిపేవారు. నేడు సౌకర్యవంతంగా నూతన భవనం ఏర్పడటంతో ఎంతో మేలు జరిగింది. గ్రామంలో నిత్యం పారిశు ధ్య పనులు చేపడుతుండడంతో వీధులన్నీ శు భ్రంగా మారాయి. గ్రామ పంచాయతీకి మంజూరైన ట్రాక్టర్తో నిత్యం చెత్త సేకరిస్తున్నారు. విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు బిగించడంతో గ్రా మం జిగేల్మంటున్నది. గతం లో తాగునీటి కోసం బోరింగు లు, బావుల వద్దకు వెళ్లేవా రు. నేడు ఇంటింటికీ కుళా యి రావడంతోపాటు స్వ చ్ఛమైన మిషన్ భగీరథ నీ ళ్లు అందుతున్నాయి. తు మ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటుతో సాగునీటి సౌలభ్యం పెరిగింది. పం టలు పండుతున్నాయి.
గ్రామంలో చేపట్టిన ప్రగతి..
కొంకల గ్రామంలో 3,800 మంది జనాభా ఉన్నది.
పల్లెప్రగతి, పంచాయతీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు.
రూ.11 లక్షలతో శ్మశానవాటిక నిర్మించారు.
రూ.22 లక్షలతో రైతుభవనం పూర్తి చేశారు.
సుమారు లక్ష రూపాయలతో సుందరంగా పల్లె ప్రకృతి వనం నిర్మించారు.
నర్సరీలో 40 వేల మొక్కలు పెంచుతున్నారు.
అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు పూర్తి.
29 రైతు కల్లాలు ఏర్పాటు చేశారు. బావుల్లో పూడికతీత పనులు చేపట్టారు.
ఉపాధి హామీ పనుల కింద రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టారు.
సుమారు 150 పైగా ఇంకుడు గంతలు నిర్మించారు.
550 వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటారు.
ఇంటింటికీ చెత్తబుట్టలు పంపిణీ చేశారు.
ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్తో చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
గ్రామంలో పాడుపడిన బావుల పూడ్చివేత, ముళ్లకంపలు, చెత్తాచెదారం, పాడుబడిన ఇండ్లు తొలగించారు.
భీమిరెడ్డి నగర్లో అంతర్గత మట్టి రోడ్లు ఏర్పాటు చేశారు.
సమష్టిగా ముందుకెళ్తున్నాం..
గ్రామాభివృద్ధి ప నులను ఉన్నతాధికారులు పర్యవేక్షించడంతోపాటు ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి చేపట్టిన ప్రతి పనిలో ప్రజలు సమష్టిగా సహకారం అందించారు. ఉపాధిహామి పథకంలో భాగంగా పనులు కల్పిస్తుండడంతో వలసలు వెళ్లే వారి సంఖ్య తగ్గింది.
సమస్యలు పరిష్కరించుకున్నాం..
గ్రామంలో నెలకొన్న అనేక సమస్యలను పల్లెప్రగతి ద్వారా పరిష్కరించుకున్నాం. రైతువేదిక, వైకుంఠధామం నిర్మించుకున్నాం. రైతులకు కల్లాలు ఏర్పాటు చేశాం. ఇంటింటికీ నల్లాలు బిగించాం. బావుల్లో పూడికతీత చేపట్టాం. ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. ప్రజల అవసరాలు తీరుస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాం.