బెంగళూరు: తనను సీఎం పదవి వరిస్తుందని తానెప్పుడూ ఊహించలేదని కర్ణాటక తదుపరి సీఎంగా ఎంపికైన బస్వరాజు ఎస్ బొమ్మై చెప్పారు. మంగళవారం తనను బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను పేద ప్రజల అభివ్రుద్ధి కోసం క్రుషి చేస్తానని బస్వరాజు బొమ్మై అన్నారు. తనపై పెద్ద బాధ్యతే పెట్టారని పేర్కొన్నారు. బీఎస్ యెడియూరప్ప మార్గదర్శకత్వంలో రాష్ట్రాభివ్రుద్ధికి క్రుషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం కష్టపని చేస్తానని చెప్పారు.
సీఎంగా రాజీనామా చేసిన యెడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా బస్వరాజు బొమ్మై నిలిచారు. సరిగ్గా 32 ఏండ్ల క్రితం బస్వరాజు బొమ్మై తండ్రి ఎస్ఆర్ బొమ్మై 1988 ఆగస్టులో రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు.