ఖాట్మండు: నేపాల్ను శుక్రవారం దట్టమైన పొగ కమ్మేసింది. ఆ దేశ రాజధాని ఖాట్మండుతోపాటు పలు నగరాలపై మందపాటి పొగ ఆవిరించింది. దీంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను రద్దు చేయగా మరికొన్నింటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు గాలిలో పొగ కణాలు పెరుగుతున్న నేపథ్యంలో అవసరం లేని బహిరంగ కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.