హైదరాబాద్లో మొదటి రోజు కర్ఫ్యూ సందర్భంగా వాహనదారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించినట్లు ఓ నకిలీ వీడియోను ప్రసారం చేసిన తొలివెలుగు యూట్యూబ్ చానల్పై సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాతో పాటు, సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేశారు. హైదరాబాద్కు సంబంధంలేని వీడియోలను ప్రసారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా, పోలీసులను కూడా మానసికంగా కృంగదీసే చర్యగా ఉన్నతాధికారులు పరిగణిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేసి తమ వ్యూస్ను పెంచుకోవడానికి కొన్ని యూట్యాబ్ చానల్స్ ప్రయత్నిస్తున్నాయని., అలాంటి వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబర్క్రైమ్ పోలీసులకు సీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తొలివెలుగు యూట్యూబ్ చానల్పై కేసు నమోదు చేసినట్లు సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.