ముంబై: ఉన్నదున్నట్లుగా మాట్లాడే అలవాటున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్.. సౌతాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఏకంగా 16.25 కోట్లు పెట్టి అతన్ని కొనడంపై కేపీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది వినడానికి కాస్త కఠినంగానే అనిపిస్తుంది కానీ నిజాయతీగా చెప్పాలంటే అతనికి చాలా ఎక్కువ పెట్టి కొన్నారు అని పీటర్సన్ అన్నాడు.
ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. అంత మొత్తం చెల్లించడానికి అతని అర్హుడు కాడని నేను అనుకుంటున్నాను. అతనిపై చాలా ఒత్తిడి ఉన్నట్లు కనిపిస్తోంది అని కేపీ అన్నాడు. అతడు సౌతాఫ్రికా టీమ్కే ఫస్ట్ చాయిస్ ప్లేయర్ కాడు. అతని నుంచి చాలా ఎక్కువ ఆశిస్తున్నాం అని కేపీ స్పష్టం చేశాడు.
మోరిస్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం. కానీ అతడు అంత నిలకడగా ఆడే వ్యక్తి కాదు. అతనిపై పూర్తి గౌరవంతోనే ఈ మాట అంటున్నాను. అతడు అంత స్పెషలేమీ కాదు. ఒకవేళ ఆడినా రెండు మ్యాచ్లు అంతే. ఆ తర్వాత నిలకడ కోల్పోతాడు. ఇది కాదు కదా అతన్ని నుంచి ఆశించేది అని కేపీ అన్నాడు. ఈ సీజన్లో మోరిస్ 4 మ్యాచ్లలో 48 రన్స్ మాత్రమే చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లోనే 18 బంతుల్లో 36 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు.