డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో 50 శాతం కరోనా మరణాలు ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోనే చోటుచేసుకుంటున్నాయని ఆ రాష్ట్ర కరోనా మరణాల ఆడిట్ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ హేమచంద్ర చెప్పారు. కరోనా లక్షణాలు బయటపడినా నాలుగైదు రోజుల వరకు చికిత్స చేయించుకోకపోవడమే అందుకు కారణమని ఆయన తెలిపారు. అదేవిధంగా రోగుల రద్దీవల్ల సమయానికి ఆస్పత్రిలో చేర్చుకోవడంలో ఆలస్యం చేయడం కూడా అందుకు మరో కారణంగా చెప్పవచ్చని హేమచంద్ర పేర్కొన్నారు.