పుణె : కేఎల్ రాహుల్ చెలరేగాడు. ఇంగ్లండ్తో పుణెలో జరుగుతున్న రెండవ వన్డేలో సెంచరీ నమోదు చేశాడు. నిజానికి ఇంగ్లండ్తో జరిగిన టీ20 మ్యాచుల్లో దారుణంగా విఫలమైన రాహుల్.. వన్డేల్లో మళ్లీ ఫామ్లోకి వచ్చేశాడు. తొలి వన్డేలో 43 బంతుల్లో 62 రన్స్ చేసి నాటౌట్గా నిలిచిన రాహుల్.. ఇవాళ రెండవ వన్డేలో సెంచరీ కొట్టాడు. రాహుల్కు ఇది వన్డేల్లో అయిదువ సెంచరీ కావడం విశేషం. రాహుల్ 114 బంతుల్లో 108 రన్స్ చేసి క్యాచ్ అవుటయ్యాడు. ఇక అయ్యర్ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్.. బ్యాటింగ్లో దూకుడు ప్రదర్శించాడు. శరవేగంగా హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 28 బంతుల్లోనే పంత్ 50 రన్స్ చేశాడు. 45 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 273 రన్స్ చేసింది.