భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో దారుణం జరిగింది. నగరంలోని గాంధీనగర్ కాలనీలో ఐదేండ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా 13 ఏండ్ల బాలుడు చిన్నారి దుస్తులు తొలగించి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన తల్లికి చిన్నారి జరిగిన విషయం తెలపడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక తల్లి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూలి పనులు చేసుకునే నిందితుడి తల్లితండ్రులు ఘటన జరిగిన సమయంలో ఇంటి వద్ద లేరని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు.