వరంగల్ అర్బన్ : నకిలీ శానిటైజర్ అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వరంగల్లో శుక్రవారం చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుండి రూ. లక్ష విలువైన శానిటైజర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ బృందం విశ్వసనీయ సమాచారం మేరకు మట్టేవాడ, జేపీఎన్ రోడ్ ప్రాంతాల్లో రైడ్ చేశారు.
ఈ సందర్భంగా నకిలీ శానిటైజర్ అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు తెలిపారు. డబ్ల్యూహెచ్వో నిబంధనలు పాటించకుండా దీన్ని తయారు చేసినట్లు ఇది క్రిములపై ఏమాత్రం పనిచేయదన్నారు. దుకాణాల నుంచి ఐదు లీటర్ల 72 క్యాన్లు, 500, 250, 100, 50 ఎంఎల్ బాటిల్స్ 305ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రోళ్ల శ్రీనివాస్, యంసాని విశ్వేశ్వర్ రావు, పరిమి ప్రసాద్ రావు, పెద్ది ప్రేమ్ కుమార్, చిమ్మని శివకుమార్గా గుర్తించారు.