హైదరాబాద్: సింగపూర్లో శతచండీ మహాయాగం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక మారియమ్మన్ ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం, కొవిడ్ మహమ్మారి పూర్తిగా అంతమై ప్రజలకు సామాన్య జీవితం సిద్ధించేందుకు ఈ యాగం నిర్వహించామని వాసవీ క్లబ్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ గొట్లూరి తెలిపారు. శతచండీ యాగాన్ని గతేడాది కూడా నిర్వహించామని వెల్లడించారు. యాగాన్ని శాస్త్రోక్తంగా మహా ఘనాపాఠీల మధ్య జరుపుకోవడం విశేషమన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమవడానికి సహకరించిన కార్యదర్శి నరేంద్ర కుమార్ నారంశెట్టి, సభ్యులు రాజశేఖర్ గుప్త, ముక్కా కిషోర్, మకేష్ భూపతి, మురళి పబ్బతి, నరేష్ యాదకు ధన్యవాదాలు తెలిపారు.