న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం, హత్యకు సంబంధించిన వివరాలను రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఆ ఘటనలో ఇవాళ చిన్నారుల హక్కుల సంస్థ ఎన్సీపీసీఆర్.. ఫేస్బుక్ అధికారులకు సమన్లు జారీ చేసింది. రాహుల్ పోస్టు చేసిన విషయంపై తాము ఇచ్చిన నోటీసుకు స్పందించకపోవడంతో ఎన్సీపీసీఆర్ ఆ సమన్లు జారీ చేయాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం 5 గంటల తమ ముందు హాజరుకావాలని ఎన్సీపీసీఆర్ తన ఆదేశాల్లో పేర్కొన్నది. వీలుకాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావాలని సూచించింది. ఫోటో, వీడియో షేరింగ్ నెట్వర్క్ ఫ్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్.. ఫేస్బుక్కు చెందినది. బాధిత కుటుంబానికి చెందిన వీడియో ఇన్ష్టాలో పోస్టు రాహుల్పై చర్యలు తీసుకోవాలని ఈ నేపథ్యంలో ఫేస్బుక్కు ఎన్సీపీసీఆర్ నోటీసు ఇచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి చర్య తీసుకున్నట్లు ఫేస్బుక్ స్పష్టం చేయలేదు. దీంతో ఫేస్బుక్కు ఎన్సీపీసీఆర్ సమన్లు జారీ చేసింది. రాహుల్ తన ఇన్స్టా ప్రోఫైల్తో జువెనైల్ జస్టిస్ యాక్ట్ను ఉల్లంఘించినట్లు ఆరోపించింది. పోక్సో చట్టం ప్రకారం సోషల్ మీడియా లేదా ఇతర పద్ధతుల్లో బాధిత కుటుంబ వివరాలను వెల్లడించరాదు.