ముంబై, ఆగస్టు 28: బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ నివాసంలో శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ పట్టుబడినట్టు తెలిసింది. అనంతరం అర్మాన్ను ప్రశ్నించేందుకు ఎన్సీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. మాదకద్రవ్యాల వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తులను పట్టుకునేందుకు ‘రోలింగ్ థండర్’ పేరిట ఎన్సీబీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం టీవీ నటుడు గౌరవ్ దీక్షిత్ను అరెస్ట్ చేసింది. డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్లో పెద్దతలకాయల పాత్ర కూడా ఉందని ఎన్సీబీ అనుమానిస్తున్నది. సల్మాన్, పలువురు ఇతర హీరోల సినిమాల్లో అర్మాన్ నటించాడు. సల్మాన్ హోస్ట్గా ఉన్న ‘బిగ్ బాస్’ టీవీ రియాలిటీ షోలోనూ అర్మాన్ పాల్గొన్నాడు.