చెన్నై : ఇండ్రస్ట్రీ కాన్క్లేవ్-2021కు ఐఐటీ మద్రాస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండస్ట్రీ-అకాడెమిక్ సహకారాన్ని ప్రోత్సహించేందుకు అదేవిధంగా నిర్మాణాత్మక భాగస్వామ్యాల కోసం నూతన ఆలోచనలను రూపొందించే మార్గాలను అభివృద్ధి చేసే నిమిత్తం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఈ కాన్క్లేవ్ను నిర్వహిస్తుంది. రానున్న శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఇండస్ట్రీ కాన్క్లేవ్ జరగనుంది.
ఇది మొదటి ఎడిషన్ కాగా అనంతరం అకాడెమిక్, పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంచే వార్షిక కార్యక్రమంగా మారనుంది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ సంస్థలు, బహుళజాతి కార్పొరేట్ గ్రూపులు, ఐఐటీ మద్రాసు నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. ఎయిర్మీటర్ ద్వారా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంగా ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఆసక్తి గల వారు ఇచ్చిన లింక్లో లాగినై రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://www.airmeet.com/e/fc847460-99c8-11eb-be0d-9b9d27d56e19.