ముంబై : (Submarine Info leak) జలాంతర్గామి రహస్య సమాచారాన్ని లీక్ చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న నౌకాదళం కమాండర్ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు రిటైర్డ్ అధికారులను కూడా అరెస్టు చేశారు. ముంబైలో ఇండియన్ నేవీకి చెందిన కిలో క్లాస్ సబ్మెరైన్ల రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇందులో ఏదైనా విదేశీ గూఢచార సంస్థ ప్రమేయం ఉందా? అనేది ఇంకా తెలియరాలేదు.
నేవీ వర్గాల సమాచారం ప్రకారం, విచారణలో వైస్ అడ్మిరల్, రియర్ అడ్మిరల్ పాల్గొంటున్నారు. ముంబైకి చెందిన సర్వీస్ అధికారి రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు ఆరోపించారు. కిలో క్లాస్ సబ్మెరైన్లను సోవియట్ యూనియన్.. సోవియట్ నౌకాదళం కోసం నిర్మించింది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సాంప్రదాయ జలాంతర్గాముల్లో ఒకటి. భారతదేశంలో ఈ జలాంతర్గాములు సింధు ఘోష్ వర్గం క్రింద ఉంచారు. ఇలాంటి 10 జలాంతర్గాములను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆధునీకరించింది. భారత నౌకాదళం వద్ద ప్రస్తుతం 15 సాంప్రదాయ జలాంతర్గాములు, రెండు అణు జలాంతర్గాములు ఉన్నాయి.
కొవిడ్ ప్రోటోకాల్ కేసులు ఉపసంహరణ.. యోగి సర్కార్ నిర్ణయం
ఇరాన్ గ్యాస్ స్టేషన్పై సైబర్ దాడి.. నిలిచిన ఇంధన విక్రయ కేంద్రాలు?!
టీ20 టైటిల్ దక్కించుకోవడంలో భారత్ ఇప్పటికీ పోటీదారే : బ్రెట్లీ
పాకిస్తాన్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ : 11 మంది మృతి
ఇది లైవ్ బ్యాక్టీరియా క్లియర్ ఫొటో.. వెల్లడించిన యూకే శాస్త్రవేత్తలు
బందీపొరాలో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాద దాడి
జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లు ప్రారంభం
సూడాన్లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..