న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్లో విభేదాలు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ అధిష్టానం. ఇందులో భాగంగా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య రాజీ కుదిర్చేలా ఓ డీల్ తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం పంజాబ్ సీఎంగా అమరీందర్ కొనసాగనుండగా.. పంజాబ్ పీసీసీ చీఫ్గా సిద్ధూని నియమించనున్నారు. ఎన్నికలకు ముందు కొన్ని నెలలుగా ఇద్దరు సీనియర్ లీడర్ల మధ్య విభేదాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆందోళనకు గురి చేసింది. దీనికి సాధ్యమైనంత త్వరగా ఫుల్స్టాప్ పెట్టాలనుకున్న పార్టీ.. ఇలా ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
సీఎంగా అమరీందర్, పీసీసీ చీఫ్గా సిద్ధూతోపాటు రాష్ట్రంలో మరో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఉండనున్నారు. వీటిలో ఒకటి దళితులకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఈ సంధి గురించి పంజాబ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ హరీష్ రావత్ వెల్లడించినట్లు ఇండియా టుడే టీవీ తెలిపింది. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అమరీందర్ చెప్పినట్లు హరీస్ రావత్ వెల్లడించారు. సిద్ధూ ఈ రాష్ట్ర భవిష్యత్తు అని, ఆయన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలని కూడా రావత్ చెప్పడం గమనార్హం.