న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరుకు చెక్ పెట్టేందుకు సిద్ధమైన పార్టీ అగ్రనాయకత్వం సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్తో విభేదిస్తున్న అసంతృప్త నేత, పార్టీ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ పదవిని కట్టబెట్టాలని యోచిస్తోంది. పంజాబ్ కాంగ్రెస్లో కీలక పదవి ఇవ్వడం ద్వారా సిద్ధూని సంతృప్తి పరచాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. సిద్ధూ ఇప్పటికే పార్టీ అగ్రనేతలతో భేటీ కావడంతో పాటు విపక్ష ఆప్ తన సామర్ధ్యం, విజన్ను మెచ్చుకుంటోందని ఇటీవల ట్వీట్ చేయడంతో రెబెల్ నేతను బుజ్జగించేందుకు పార్టీ హైకమాండ్ సన్నద్ధమైంది.
పంజాబ్ కాంగ్రెస్లో వర్గ పోరును పరిష్కరించేందుకు కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాలకు పదునుపెడుతున్న నేపథ్యంలో ఆప్ను ప్రశంసిస్తూ సిద్ధూ చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా సిద్ధూకు నాయకత్వ పగ్గాలను అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ హరీష్ రావత్ బుధవారం సాయంత్రం పార్టీ నేత రాహుల్ గాంధీతో సమావేశమవుతారని, ఈ భేటీ అనంతరం సిద్ధూకు కీలక పదవిని కట్టబెట్టే వ్యవహారంపై స్పష్టత రానుందని భావిస్తున్నారు.