చండీఘడ్ : పంజాబ్లో తీవ్ర విద్యుత్తు కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ కరెంటు కోతలు విధించారు. ఆ కోతలను నవజ్యోత్ సింగ్ సిద్దూ తప్పుపట్టారు. అమరీందర్ పాలన సరిగా లేదని స్వంత పార్టీకి చెందిన సిద్దూ ఇటవల ఫైర్ అయ్యారు. అయితే శిరోమనీ అకాలీ దళ్ నేతలు సిద్దూపై విమర్శలు గుప్పించారు. అమృత్సర్లో ఉన్న సిద్దూ ఇంటికి 8 లక్షల కరెంటు బిల్లు బాకీ ఉన్నదని, ఆయన ఆ బిల్లు కట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని శిరోమనీ అకాలీదళ్ ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నేత సిద్ధూ మొత్తం రూ.8,67,540 కరెంటు బిల్లు చెల్సించాల్సి ఉంది. అయితే నిన్నటికే ఆ బిల్ పేమెంట్ చివరి రోజు.
దీని గురించి ఇప్పటి వరకు సిద్ధూ ఏమీ మాట్లాడలేదు. కానీ విద్యుత్తు కోతలను విధిస్తూ ప్రభుత్వం చేసిన నిర్ణయాలను ఎలా సిద్దూ తప్పుపడుతున్నారని శిరోమనీ అకాలీదళ్ ప్రశ్నించింది. విద్యుత్తు కొరత నుంచి బయటపడేందుకు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్న ఏసీలను బంద్ చేస్తున్నారు. ప్రతి రోజూ అక్కడ 14వేల మెగావాట్ల విద్యుత్తును వినియోగిస్తున్నారు. పంజాబ్లో విద్యుత్త సరఫరా అంశం కీలకంగా మారింది. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడం విశేషం. ప్రస్తుతం పంజాబ్ విద్యుత్తు శాఖకు ఆ రాష్ట్ర సీఎంయే ఇంచార్జీగా ఉన్నారు. 2019లో రాజీనామ చేసిన సమయంలో ఆ శాఖను సిద్దూ కే కేటాయించే ప్రయత్నం చేశారు.