ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం
ఎదులాపురం,జూన్15 : పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులతో హరితహారం, పారిశుధ్యం, పట్టణ ప్రగతి, తాగునీరు సుం దరీకరణపనులు, తదితర అంశాలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదిలాబా ద్ మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతామని, ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై దిశానిర్దేశం చేశారని, అందుకనుగుణంగా ముందుకు సాగుదామన్నారు. హరితహారంలో నా టిన మొక్కల సంరక్షణకు ట్రీగార్డులను ఏర్పాటు చేయాలన్నా రు. సుందరీకరణ పనుల్లో భాగంగా డివైడర్ మధ్యలో మొక్కలు నాటాలన్నారు. పెండింగ్లో ఉన్న భవన నిర్మాణాలకు అనుమతులను వెంటనే మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్ శైలజను ఆదేశించారు. నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టాలని, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని సూచించారు. సూపర్ స్ప్రెడర్లందరికీ వ్యా క్సిన్ ఇవ్వాలన్నారు.
అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని , అనధికార లే అవుట్లను రెగ్యులరైజ్ చేయవద్దని, నిబధనలకు అనుగుణంగా ఉన్న లే అవుట్లకు 10 శాతం భూమిని మున్సిపల్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇంటింటా చెత్త సేకరణ, రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేయాలని , పాటుబడ్డ ఇళ్లను కూల్చివేయాలని, సీ జనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ కొవిడ్ కారణంగా పట్టణంలో చేపట్టే అభివృ ద్ధి పనులు కుంటుపడ్డాయన్నారు. పట్టణంలో పది ఓపెన్ జిమ్ లు, పార్క్లు ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్ స్తంభాలను సమకూర్చాలని, కొన్ని వార్డుల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి కాలేదని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో మాట్లాడుతూ.. వ ర్షాకాలంలో మలేరియా,డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుం డా పారిశుధ్య పనులు కొనసాగించాలన్నారు. జి ల్లా మలేరియా నివారణ అధికారి మెట్పెల్లివార్ శ్రీధర్, అర్అండ్బీ ఈఈ నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజనీ , ఆయా వార్డుల కౌన్సిలర్లు ,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.