కుంటాల, మే, 8 : మండల కేంద్రంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తుల అంగీకారంతో దుకాణాలను మూడు రోజులుగా మూసివేశారు. ప్రజలు బయటకు రావడం లేదు. స్వీయ గృహ నిర్బంధం పాటిస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే సోమవారం నుంచి కొంత సడలింపు ఇచ్చేలా చర్యలు చూస్తామని సర్పంచ్ దొనికేన సమత తెలిపారు.
కడెంలో..
కడెం, మే 8 : గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. మండలంలోని శనివారం నాటికి 10238 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 740 మందికి పాజిటివ్ వచ్చినట్లు పీహెచ్సీ వైద్య సిబ్బంది తెలిపారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇప్పటికే కడెంతో పాటు, పాతమద్దిపడగ, కొత్తమద్దిపడగ, లింగాపూర్, మాసాయిపేట గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. ఉదయం, సాయం త్రం కేవలం గంట సమయం మాత్రమే దుకాణాలకు సమయాన్ని కేటాయించారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కరో నా లక్షణాలు కనిపిస్తే వైద్య సిబ్బందికి చెప్పాలని, అలాగే కడెం పీహెచ్సీలో పరీక్షలు చేయించుకోవాలని సూపర్వైజర్ గోపాల్ తెలిపారు.