లక్నో : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడగించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. మే 14 న పంచాయతీ ఎన్నికలు, అనంతరం రంజాన్ పండుగ తర్వాత గ్రామాల్లో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్డౌన్ను పొడగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తొలుత ఏప్రిల్ 29 న వారాంతపు బంద్ చేపట్టారు. తర్వాత దానిని మే 4, మే 6 వరకు, ఆ తర్వాత మే 10 వరకు పొడగించారు. ఇప్పుడు యోగి ప్రభుత్వం మళ్ళీ కరోనా కర్ఫ్యూను మే 17 న ఉదయం 7 గంటల వరకు పొడిగించింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టీం -9 తో ఆదివారం జరిపిన సమీక్ష సమావేశంలో లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించారు. కరోనా ఇన్ఫెక్షన్ చైన్ను విచ్ఛిన్నం చేయడానికి కరోనా కర్ఫ్యూను మరోసారి మే 17 న ఉదయం ఏడు గంటల వరకు పొడిగించారు. ఈ సమయంలో అన్ని ఆంక్షలు మునుపటిలాగే అమలులో ఉంటాయని, అవసరమైన సేవలకు మినహాయింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని వారు చెప్పారు. ప్రోటోకాల్ను కచ్చితంగా అమలు చేస్తేనే కరోనా కర్ఫ్యూ ప్రయోజనం విజయవంతమవుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
క్రికెట్ ఆడే ఏనుగును ఎక్కడైనా చూశారా..? .. వీడియో వైరల్
మొట్టమొదటి బర్త్ కంట్రోల్ పిల్కు ఆమోదం.. చరిత్రలో ఈరోజు
Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు
25 సార్లు ఎవరెస్ట్ ఎక్కాడు.. కొత్త రికార్డు నెలకొల్పాడు..
దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభం.. ఎక్కడంటే..!
ఆర్టికల్ 370 తొలగింపు భారత్ అంతర్గత విషయం: మహమూద్ ఖురేషి
చేతులు కలుపనున్న అగ్రరాజ్యాలు.. పుతిన్కు బైడెన్ ఆహ్వానం
కరోనా వేళ ఖరీదవుతున్న ఆహారాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..