కరీంనగర్ : మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి తన మంచి మనసును, మానవతను చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూర్ గ్రామానికి చెందిన శంకరయ్య కుమార్తె జింక తన్మయ చిన్నతనంలోనే రెటినైటిస్ స్పిగ్ మెంటోస్ వ్యాధితో కంటిచూపును కోల్పోయింది. అయినప్పటికీ ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎంకామ్ పూర్తి చేసింది. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతోంది. అయితే ఆన్లైన్ క్లాసులు వినేందుకు ల్యాప్టాప్ కొనలేని పరిస్థితుల్లో ఉన్నానని, కుటుంబం తీవ్ర పేదరికంలో ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్కు 15 రోజుల క్రితం తన్మయ తెలిపింది. తన్మయ బాధను అర్థం చేసుకున్న మంత్రి కొప్పుల.. దివ్యాంగుల శాఖ నుంచి రూ. 50 విలువ చేసే ల్యాప్టాప్ను ఆమెకు శనివారం అందించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్కు తన్మయ కృతజ్ఞతలు తెలిపింది.