చెన్నై : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. స్పేయిన్ నుంచి వచ్చిన ఓ పార్సిల్లో దాదాపు 56 లక్షల విలువైన మాదకద్రవ్యాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అట్టాపెట్టెతో చేసిన బాక్స్లో ఓ గ్రీటింగ్ కార్డు, రెండుప్లాస్టిక్ కవర్లు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు వాటిని తనిఖీ చేశారు. వీటిలో 994 పింక్ పనిషర్ ఎండీఎంఏ, 249 ఎల్ఎస్డీ స్టాంప్లను స్వాధీనం చేసుకున్నారు. పార్సిల్పై ఉన్న చిరునామాను పరిశీలించిన చైన్నై, కడలూరు కస్టమ్స్ అధికారులు పుదుచ్చేరిలోని అరొవిల్లే ప్రాంతానికి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి ఇళ్ల నుంచి 2.5 లక్షల విలువైన 5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు గంజాయిని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నుంచి తీసుకువస్తున్నట్లు విచారణలో గుర్తించామని అధికారులు తెలిపారు.