బెంగళూరు: సమాజంలో న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా మారిందని జస్టిస్ పీ కృష్ణ భట్ చెప్పారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రెండుమూడు రోజుల కిందట పదవీవిరమణ చేసిన ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘న్యాయమూర్తిపైనా ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు న్యాయమూర్తులుగానీ, న్యాయాధికారులుగానీ స్వచ్ఛందంగా నార్కో అనాలసిస్ పరీక్షకు ముందుకు రావాలి’ అని సూచించారు.