Aabha Muralidharan | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): దోషిగా తేలిన ప్రజాప్రతినిధులను ఆటోమెటిక్గా అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కేరళ సామాజిక కార్యకర్త అభా మురళీధరన్ సుప్రీంకోర్టులో శనివారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును అందులో ప్రశ్నించారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో పిటిషన్ దాఖలుకు గల కారణాలను ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ఆమె ప్రత్యేకంగా చర్చించారు.