భోపాల్ : మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఆరు మినీ ట్రక్కులను బీజేపీ నాయకుడు ఫ్లాగ్ చేస్తున్నట్లు చూపించే వీడియోతో మధ్యప్రదేశ్లో వివాదం చెలరేగింది. ఈ సంఘటనను నెటిజన్లు, ప్రతిపక్ష కాంగ్రెస్ సిగ్గులేని ఫోటో షూట్ గా పేర్కొంది. బీజేపీ ఎంపీ, భోపాల్ మాజీ మేయర్ అలోక్శర్మ వివిధ ఆస్పత్రుల నుండి మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఆరు మినీ ట్రక్కులను ఫ్లాగ్ చేశారు. శవాలను తీసుకువెళ్ళడానికి ఉద్దేశించిన ముక్తి వాహనాలు ఆరింటిలో ఓ వాహనాన్ని ఫోటోషూట్ కోసం నిలిపివేశారని కూడా ఆరోపణ.
వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ దీన్ని సిగ్గుచేటుగా చర్యగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి నరేంద్ర సలుజా అభివర్ణించారు. అంతకుముందు బీజేపీ నాయకులు ఇండోర్లో ఆక్సిజన్ ట్యాంకర్ రవాణాను నిలిపి పూజలు చేశారు. ఇప్పుడు మరొక నాయకుడు శవ వాహన్స్ను ఫ్లాగ్ చేస్తూ ఫోటో షూట్ నిర్వహించారు. మరొక మంత్రి కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభిస్తూ ఫోటోలు దిగారు. ఆపదలో కూడా ఫోటోషూట్ అవసరాన్ని కనుగొంటున్నారని దుయ్యబట్టారు.
వివాదంపై శర్మ స్పందిస్తూ ఆరోపణలను ఖండించారు. మృతదేహాలను తీసుకెళ్లడానికి శవ వాహనాల కొరత గురించి నివేదికలు చదివిన తరువాత తాను ఈ వాహనాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ వాహనాలను సంబంధిత ఆసుపత్రి నిర్వహణకు అప్పగించేటప్పుడు మీడియా వ్యక్తులు హాజరయ్యారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు, వివాదానికి కారణం కాంగ్రెస్ చేసే మురికి రాజకీయాలే అని ఆయన పేర్కొన్నారు.