ముంబై: ప్రముఖ సంగీత దర్శకుడు వన్రాజ్ భాటియా (94) కన్నుమూశారు. వృద్ధాప్యంలో తలెత్తే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ముంబైలోని తన నివాసంలో మరణించారు. భూమిక, 36 ఛౌరంగి లేన్, జానే భీ దో యారో, అంకుర్ తదితర సినిమాలకు భాటియా సంగీతాన్ని అందించారు. లిరిల్ సబ్బు యాడ్ కోసం ఆయన అందించిన మ్యూజిక్ ట్రాక్ ‘లా లలాలా’ ప్రాచుర్యం పొందింది. 2012లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. మరోవైపు కరోనాతో ప్రముఖ జర్నలిస్టు శేష్ నారాయణ్ సింగ్ (70) కన్నుమూశారు.