పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
అన్ని సౌకర్యాలతో చివరి మజిలీ
పూర్తయిన డంపింగ్యార్డు
దమ్మపేట, ఏప్రిల్ 19: పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పల్లెలు ప్రగతికి చిహ్నంగా మారుతున్నాయి. డంపింగ్యార్డు, వైకుంఠధామం, ప్రకృతివనం ఏర్పాటుతో గ్రామరూపురేఖలు మారిపోయాయి. మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండడంతో పల్లెవాసులకు మెరుగైన జీవనం లభిస్తోంది. దమ్మపేట పంచాయతీ అభివృద్ధి వైపు పయనిస్తోంది.
చివరి మజిలీకి తీరిన చింత
రాష్ట్ర ప్రభుత్వం రూ.12 లక్షలు కేటాయించి వైకుంఠధామాన్ని పూర్తి చేయడంతో సామాన్యులకు దహన సంస్కారాలకు అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో చివరి మజిలీకి చింత తీరినట్లయింది. గ్రామంలో ఎవరు చనిపోయినా వారిని దహనం చేసేందుకు కనీసం స్థలం కూడా లేకపోవడం, శ్మశానవాటికలు లేకపోవడంతో వారిని ఖననం చేయాలన్నా, దహన సంస్కారాలు నిర్వహించాలన్నా గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ అవస్థలను రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి పంచాయతీలో వైకుంఠధా మం ఉండాలని సంకల్పించారు. దాని నిర్మాణానికి రూ. 12లక్షలు కేటాయించి సామాన్యుల ఇబ్బందులను గుర్తించి దహన సంస్కారాల వ్యథను తీర్చారు. రూ.12 లక్షలతో వైకుంఠధామం ఏర్పాటు చేయగా అందులో దాతలు తమకు రూ.50 వేలు వెచ్చించి శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. గౌడ సంక్షేమ సంఘం నాయకులు రూ.1.75లక్షలతో శవపేటిక గదిని నిర్మించి ఇచ్చారు.
మెరుగుపడిన పారిశుధ్యం
రూ.10 లక్షలతో డంపింగ్యార్డు నిర్మించడంతో పారిశుధ్యం మెరుగుపడింది. పంచాయతీ ట్రాక్టర్ ప్రతి వీధికీ వచ్చి చెత్తా చెదారాన్ని సేకరిస్తోంది. దానిని డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. దీంతో గ్రామం పారిశుధ్యరహితంగా మారింది. స్వచ్ఛత వైపు పయనిస్తోంది. ఇప్పటికే ఆదర్శ పంచాయతీగా ఉన్న దమ్మపేట గ్రామం.. పల్లెప్రగతి కార్యక్రమంతో అభివృద్ధిలో మరో అడుగు ముందుకేసి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి
కరోనాలో కాసుల కక్కుర్తి.. యూపీలో అంత్యక్రియలకు తడిసిమోపెడు
IPL 2021:రాణించిన బ్యాట్స్మెన్..చెన్నై స్కోర్ 188