ఢిల్లీ : సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు, 12వ తరగతి పరీక్షల వాయిదా అనంతరం కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం వెలువరించింది. ఏప్రిల్ 18న జరగాల్సిన నీట్ పీజీ-2021 ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించింది. పరీక్షను తిరిగి మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబశాఖ మంత్రి హర్షవర్దన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో యువ మెడికల్ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.