ముంబై: ఒక మహిళా కానిస్టేబుల్ 50 మంది పేద పిల్లలను దత్తత తీసుకున్నారు. పదో తరగతి వరకు వారి చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని తెలిపారు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రెహనా షేక్ ఈ మేరకు ఉదారత చాటారు. ఒక స్కూలుకు చెందిన 50 మంది నిరుపేద పిల్లలను ఆమె దత్తత తీసుకున్నారు.
“నా స్నేహితురాలు నాకు ఒక పాఠశాలకు చెందిన కొన్ని ఫొటోలు చూపించింది. అక్కడి పిల్లలను చూసిన తరువాత వారికి నా సహాయం అవసరమని నేను గ్రహించాను. అక్కడున్న 50 మంది పిల్లలను దత్తత తీసుకున్నాను. 10 వ తరగతి వరకు వారి విద్యా ఖర్చులను నేను భరిస్తాను” అని కానిస్టేబుల్ రెహనా షేక్ వెల్లడించారు.