ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక ఎన్జీవో సంస్థ వీధి పిల్లల చదువుకు కృషి చేస్తున్నది. ముంబైలోని కాండివాలి ప్రాంతానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘జునూన్ ఫౌండేషన్’ ఈ మేరకు చొరవ చూపింది. స్థానిక ఫుట్ ఓవర్ బ్రిడ్జీల వద్ద వీధి పిల్లలకు క్లాసులు నిర్వహిస్తున్నది. అలాగే వీరి కోసం తాత్కాలిక తరగతి గదులను కూడా ఏర్పాటు చేసింది.
వీధి పిల్లలకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇస్తామని, తర్వాత వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతామని వాలంటీర్ హిమంతి చెప్పారు. దీని కోసం అయ్యే ఖర్చులన్నీ ఎన్జీవో సంస్థ భరిస్తుందని ఆమె వెల్లడించారు.