ముంబై : కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్లైన్లో ఉన్న ఆరోగ్య, పోలీసు సిబ్బందికి ముంబైకి చెందిన వ్యాపారవేత్త కేతన్ రావల్ తన వానిటీ వ్యాన్లను ఉచితంగా అందించాడు. ఈ వ్యానిటీ వ్యాన్లలో బెడ్, వాష్ రూమ్, డ్రెస్సింగ్ టేబుల్, బెడ్ రూమ్తో పాటు ఏసీ సౌకర్యం ఉంటుంది. రౌండ్ ది క్లాక్ పనిచేసే ఈ ఫ్రంట్ లైన్ వర్కర్లు కాసేపు విశ్రమించేందుకు, భోజనం చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నట్లు రావల్ తెలిపారు.
తన వద్ద ఉన్న మొత్తం 50 వ్యానిటీ వ్యాన్లలో 12 పోలీసులకు, ఆరోగ్య కార్యకర్తలకు అందించినట్లు తెలిపారు. అవసరమైతే కొవిడ్ రోగులకు చికిత్స అందించే ఆస్పత్రులకు తన వ్యానిటీ వ్యాన్లను అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ వ్యాన్లు ప్రతిరోజూ ఉదయం ఒకసారి శుభ్రం చేయనున్నట్లు పేర్కొన్నారు.