కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తుంది. దేశ వ్యాప్తంగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఆక్సీజన్ కొరత కూడా తీవ్రంగా ఉంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల లాక్డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నారు. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇవన్నీ పట్టనట్టు కొందరు సెలబ్రిటీలు మాత్రం ఎంచక్కా విహారయాత్రలకు వెళుతున్నారు. విహారయాత్రలకు వెళ్లే వాళ్లకు హక్కు, డబ్బు ఉన్నప్పటికీ ఇలాంటి టైమ్ లో అలాంటి పనులు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదంటోంది శృతిహాసన్.
ఇది చాలా కఠిన సమయం. ఇలాంటి సమయంలో కొందరు విహారయాత్రలకు వెళ్లడం భావ్యంగా లేదు. మనల్ని అభిమానించే అభిమానులు కష్టాలలో ఉన్నప్పుడు మనం పార్టీలు చేసుకోవడం, విహారయాత్రలకు వెళ్లడం మంచి పద్దతి కాదని అంటుంది శృతి హాసన్. నా వంతుగా ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి సమాచారాన్నైనా షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. ఈ విషయాలను రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. కాగా, ఓ వైపు కరోనాతో దేశమంతా వణికిపోతుంటే రణబీర్, అలియా, జాన్వి, సారా, దిశా పటానీ లాంటి సెలబ్రిటీలు హాలీడేస్కి వెళ్లడంపై నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు.