ముంబై: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని జైన వర్గం తమ ఆలయాల్లో ఒకదానిని కరోనా చికిత్స కేంద్రంగా మార్పు చేశారు. సాధారణ, డీలక్స్ వార్డులతో వంద పడకలు ఏర్పాటు చేశారు. పరీక్షల కోసం ల్యాబ్, ఆక్సిజన్ వ్యవస్థలు ఉన్న ఈ కరోనా చికిత్స కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. పది మంది డాక్టర్లు, 50 మంది వైద్య సిబ్బంది సేవలందించనున్నారు.
ముంబై వాసులకు ఇది కొంత ఊరటనిస్తుందని ఇక్కడ పని చేసే డాక్టర్ తన్వి తెలిపారు. గత ఏడాది కూడా ఈ జైన మందిరాన్ని కరోనా కేంద్రంగా మార్చారు. సుమారు రెండు వేల మంది కరోనా రోగులకు వైద్య చికిత్స అందజేశారు.