ఎంఎన్ఎస్ చీఫ్కు రాజ్ఠాక్రేకు కోర్టు నోటీసులు

ముంబై : మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ఠాక్రేకు ముంబైలోని అలోకల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తమ పోస్టర్లను ఎంఎన్ఎస్ పార్టీ కార్యకర్తలు చింపివేశారని అమెజాన్ చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అమెజాన్ యాప్లో మరాఠీ లాంగ్వేజ్ ఆప్షన్ లేనందున పోస్టర్లను చింపివేసినట్లు పార్టీ కార్యకర్తలు పేర్కొన్నారు. అమెజాన్ యాప్లో మరాఠీని కమ్యూనికేషన్ భాషగా చేర్చాలని కోరుతూ రాజ్ ఠాక్రే అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ కు ఇటీవల లేఖ రాశారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి ప్రాంతీయ భాషలను వినియోగిస్తున్నారని, దేశంలో విస్తృతంగా వాడుతున్న మూడో భాష మరాఠి అని పేర్కొన్నారు. దీనిపై అమెజాన్ కార్యాలయంలో సమావేశమై సమస్యను పరిష్కరించడానికి 20 రోజుల సమయాన్ని అమెజాన్ కోరింది. అయినా ఎంఎన్ఎస్ కార్యకర్తలు తమ పోస్టర్లను చింపివేశారని అమెజాన్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కోర్టు జనవరి 5వతేదీన కోర్టుకు హాజరుకావాలని కోరుతూ రాజ్ ఠాక్రేకు సమన్లు జారీ చేసింది.
తాజావార్తలు
- ఎన్నికల వేళ మమతా దీదీకి మరో ఎదురుదెబ్బ?
- యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం
- 'ధరణితో భూ రికార్డులు వ్యక్తుల చేతుల్లోంచి వ్యవస్థలోకి'
- శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్పై విప్ బాల్క సుమన్ సమీక్ష
- "ఉపశమనం కోసం లంచం" కేసులో డీఎస్పీ, ఇన్స్పెక్టర్ అరెస్ట్
- క్రాక్ 2 ఆయనతో కాదట..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
- స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు