నల్లమలకు ఎప్పుడు లేనంత అందం వచ్చింది. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్-శ్రీశైలం మధ్య వాహనాల రాకపోకలు లేకపోవడంతో నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో జంతువులన్నీ స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. 2,611 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో సుమారు 25 వరకు పెద్ద పులులు, 200 చిరుత పులులు తదితర జంతువులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మనుషుల జాడ లేకపోవడంతో వన్యప్రాణులు ప్రశాంత వాతావరణంలో మనుగడ సాగిస్తున్నాయి.