కొండగట్టులో కొనసాగుతున్న అఖండ హనుమాన్ చాలీసా పారాయణం
మల్యాల, మార్చి 29: కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్విరామంగా కొనసాగుతున్నది. రెండు మండలాల కాలం పాటు కొనసాగే కార్యక్రమంలో భాగంగా పదమూడో రోజు సోమవారం పూడూర్ గ్రామానికి చెందిన అంజన్న భక్తమండలి, మల్యాలకు చెందిన మఠాంజనేయస్వామి ఆలయ భజన బృందం, జగిత్యాలకు చెందిన వికాసతరంగణి భజన మండలి సభ్యులు కలిసి 11 సార్లు హనుమాన్చాలీసా పారాయణం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె సతీమణి దీవెన, జడ్పీటీసీలు రామ్మోహన్రావు, ప్రశాంతి పాల్గొని హనుమాన్చాలీసా పారాయణం చేశారు. అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.