మృతుల్లో 8 మంది పిల్లలే.. ముంబైలో కూలిన భవనం
ముంబై, జూన్ 10: ముంబైలో బుధవారం ఎడతెగని భారీ వర్షం కారణంగా మాల్వానీ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 12 మంది చనిపోయారు. మృతుల్లో 8 మంది పిల్లలే. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు.బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. భవనం పై రెండు అంతస్థులు కూలి పక్కనే ఉన్న మరో ఇంటి మీద పడ్డాయి. శిథిలాల్లో మరికొంత మంది చిక్కుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. కూలిన భవనం నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నదని, కాంట్రాక్టర్ను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు.