ముంబై: మహారాష్ట్రలో వారంత లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఒక ఎన్జీవో సంస్థ నగరంలోని నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నది. పేదలకు ఆహారం పంపిణీని గత ఏడాది ప్రారంభించినట్లు సహ వ్యవస్థాపకుడు రూబెన్ తెలిపారు. ముంబైలో ఆకలిని తొలగించడానికి తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది 47 లక్షలకు పైగా భోజనాలు అందించినట్లు వివరించారు.
ముంబైలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి భోజనం పంపిణీని ప్రారంభించినట్లు రూబెన్ వెల్లడించారు. సాధారణ పరిస్థితి నెలకొనేవరకు ఆహారం పంపిణీని కొనసాగిస్తామని చెప్పారు. క్రౌడ్ ఫండింగ్ లింక్ ద్వారా ఆన్లైన్ ఫండ్స్తో పాటు కార్పొరేట్ సంస్థల సహకారం పొందుతున్నట్లు తెలిపారు. తమ టీమ్లో 200 మంది వాలంటీర్లున్నట్లు వెల్లడించారు.