కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మళ్లీ జాతీయ స్థాయిలో లాక్డౌన్కు దిగబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈసారి పెద్ద ఎత్తున లాక్డౌన్లుండబోవన్న ఆమె.. వైరస్ అదుపునకు స్థానిక లాక్డౌన్లే ఉంటాయన్నారు. మంగళవారం ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్తో వీడియో కాన్ఫరెన్స్ను నిర్మల నిర్వహించారు. భారత అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ అందిస్తున్న ఆర్థిక చేయూతను ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. ఈ క్రమంలోనే పైవిధంగా స్పందించిన మంత్రి.. ‘టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్’ వ్యూహంతో ముందుకెళ్తామన్నారు.