మహబూబ్నగర్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్నారు నవాబ్పేట మండలం తీగలపల్లి గ్రామస్తులు. మూడేండ్ల కిందట పెద్దగా వసతులు లేని గ్రామం నేడు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. పల్లెప్రగతితో కొత్తరూపు సంతరించుకున్నది. రోడ్లపై మురుగు నీటితో స్వాగతం పలికి న గ్రామంలో నేడు అండర్గ్రౌండ్ డ్రైనేజీతో అందంగా మారింది. మూడేండ్ల ల్లో 60 వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పచ్చని తోరణం కట్టినట్లుగా గ్రా మం పచ్చదనంతో ఆకట్టుకుంటున్నది. మైసమ్మ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉన్న తీగలపల్లిలో పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేసేందుకు కనీసం స్థలం కూడా లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని కేవలం 20 రోజుల్లో రెవెన్యూ గుట్టలను చ దును చేసి అందమైన నందనవనంగా మా ర్చారు. ఒకప్పుడున్న గుట్టల స్థానంలో.. ఇప్పుడు పల్లెప్రకృతివనం ఆకట్టుకుంటున్నది. మిగతా గ్రామాల్లా కాకుండా ఇ క్కడ హరితహారం కోసం ప్రభుత్వం ఇ చ్చిన మొక్కలను పెద్దగా నాటరు. సమీపంలోని అటవీ ప్రాంతంలో గ్రామానికి చెందిన ఫారెస్టు వాచర్ల సహకారంతో సహజ సిద్ధమైన అటవీ విత్తనాలను సేకరించి వాటిని నర్సరీలో పెంచి ఆ మొక్కలనే నాటుతున్నారు. ఇలా చేయడంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. బయటి నుంచి తెచ్చిన మొక్కల కంటే అటవీ ప్రాంతం నుంచి సేకరించిన విత్తనాలతో సిద్ధం చే సుకున్న మొక్కల సర్వైవల్ రేటు చాలా బాగుందని చెబుతున్నారు. వేప, అశోక, కొబ్బరి, బాదం, టేకు, అల్లనేరే డు, సీతాఫలం, బొప్పాయి, నా రింజ, మామడి సహా మరో 15 రకాల మొక్కలను పల్లెప్రకృతి వనంలో నాటారు.
ఆదర్శంగా..
గ్రామంలో రూ. 12.60 లక్షలతో శ్మశానవాటిక, రూ.2.40 లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు ఏర్పాటు చేశారు. ప్ర తి ఇంటికీ తడి, పొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ని త్యం ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరిస్తున్నారు. ట్రాక్టర్లోనే చెత్త వేసేలా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సేకరించిన చెత్తతో కంపోస్ట్ ఎరువు తయారు చేసి నర్సరీలో, నాటిన మొక్కలు ఏపుగా పెరిగేందుకు వినియోగిస్తున్నారు. ఉపా ధి హామీ ద్వారా వాటర్మెన్లను ఏర్పాటు చేసి ట్యాంకర్ ద్వారా నిత్యం వాటరింగ్ చేస్తున్నారు. ప్రతిరోజూ రోడ్లు శుభ్రం చేస్తున్నారు. వారానికి ఒకటి, రెండు సార్లు ఫా గింగ్ చేస్తున్నారు. గ్రామంలో పాడుబడిన బావుల పునరుద్ధరణకు తొలిసారిగా ఉపాధి హామీలో పనులు చేపట్టారు. బావిలో నీళ్లు లేక గ్రామానికి చెందిన ఒక రైతు ఐదు బోర్లు వేశాడు.. అయినా నీళ్లు రాలేదు. ఉ పాధి పథకంలో భాగంగా ఆరు మీటర్ల మేర పూడికతీత చేశారు. ఇప్పుడు నీళ్లు వచ్చా యి. అడవిలోని గుట్టల్లో సుమారు 3 వే ల కందకాలు తవ్వించారు. వీటివల్ల భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావులు రీచార్జి అవుతున్నాయి. కరోనా సమయంలో ఒకే రోజు 234 మంది ఉపాధి పనికి వచ్చేలా గ్రామ పంచాయతీ ప్రజలను ప్రోత్సహించింది. సర్పంచ్ జంగ య్య, పంచాయతీ కార్యదర్శి నర్మద ఆధ్వర్యంలో స్థానికుల సహకారంతో తీర్చిదిద్దారు.
స్వచ్ఛతకు మారుపేరుగా..
గ్రామంలో రెండేండ్ల కిందటే ప్రతి ఇంటికీ మరుగుదొ డ్డి నిర్మించారు. వంద శాతం ఇంకుడు గుంతలు చేపట్టారు. కొన్ని చోట్ల నీటి ఊటతో ఇంకుడు గుంతలు తీయలేని పరిస్థితి వస్తే.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశా రు. ఇంకుడు గుంతలు, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ, పల్లెప్రకృతివనం, ఎవెన్యూ ప్లాంటేషన్, ఉపాధి పనులు ఇలా అ న్నింటికీ ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్, ట్యాంకర్ ఉపయోగపడుతున్నాయి. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు.
ప్రతి గ్రామం తీగలపల్లిలా మారాలి..
పల్లెప్రగతితో గ్రామాలు అందంగా ముస్తాబవుతున్నాయి. ఊహించని విధంగా మార్పు వచ్చేసింది. నిత్యం ఇంటి ముందు ట్రాక్టర్లతో చెత్త సేకరణతో మున్సిపాలిటీలను తలపిస్తున్నా యి. ప్రభుత్వం వసతులు కల్పించినా.. స్థానికంగా పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులం తా ఐక్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటేనే బాగుపడతాయి. ఇందుకు తీగలపల్లి చక్కని ఉదాహరణ. గ్రామంలో పల్లెప్రకృతివనం, నర్సరీ, ఎవెన్యూ ప్లాం టేషన్ ఆకట్టుకుంటున్నాయి. పారిశుధ్యంలోనూ ఆదర్శంగా నిలిచింది. ప్రతి గ్రామం తీగలపల్లిలా మారాలి. ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగితే గ్రామాలన్నీ అభివృద్ధిలో దూసుకుపోతాయి.
సమస్యలన్నీ దూరమయ్యాయి..
గతంలో గ్రామంలో ఎటుచూసినా సమస్యలు దర్శనమిచ్చేవి. అస్తవ్యవస్తమైన డ్రైనేజీలతో రోడ్లపైకి మురుగు నీరు వచ్చేది. రోడ్లు ఊడ్చేవారు కాదు. కనీసం పచ్చదనం లేకుండె. నాలుగైదు రోజులకోసారి తాగునీరు వచ్చేది. ఇప్పుడు మిషన్ భగీరథతో పరిస్థితి మారిపోయింది. పల్లెప్రగతితో క్రమంగా సమస్యలన్నీ దూరమమయ్యాయి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, గ్రామస్తుల సహకారంతో నందనవనంగా మార్చుకున్నాం. ఇప్పుడు ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. శ్రమదానం వంటి పనులు ఉన్నప్పుడు ఇప్పుడు బాగా స్పందిస్తున్నారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా.
ట్రాక్టర్, ట్యాంకర్ వరం..
ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ ముందుకువెళ్తున్నాం. సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. నేను పంచాయతీ కార్యదర్శిగా వచ్చినప్పుడు 50 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా పూర్తి కాలేదు. స్థానికుల సహకారంతో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించాం. వీటిని తప్పనిసరిగా వినియోగించేలా గస్తీ ఏర్పాటు చేశాం. ఆరుబయట మలవిసర్జన చేయకుండా కట్టడి చేశాం. ట్రాక్టర్, ట్యాంకర్ రాకతో గ్రామానికి వరంగా మారింది. ప్రతి పనికీ గతంలో కిరాయి ట్రాక్టర్ వాడాల్సి వచ్చేది. ఇప్పుడు సొంత ట్రాక్టర్తో పనులన్నీ చకచకా పూర్తవుతున్నాయి.
సీఎం కేసీఆర్ పేరిట వనం..
పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు అనువుగా స్థలం లభించలేదు. రెవెన్యూ గుట్టల్లో స్థలం చదును చేసేందుకే 20 రోజులపైన పట్టింది. గ్రామస్తుల సహకారం బాగుంది. సీఎం కేసీఆర్ విధించిన లక్ష్యాన్ని తూచా తప్పకుండా పాటించాం. సీఎం పుట్టిన రోజున ఆయన పేరిట కేసీఆర్ వనం ఏర్పాటు చేశాం. సుమారు 600 మొక్కలు ఏర్పాటు చేశాం. గ్రామస్తులంతా ఓ లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టే సక్సెస్ అయ్యాం. పల్లెప్రకృతి వనంలో దాతల సహకారంతో కూర్చునేందుకు బెంచీలు సైతం ఏర్పాటు చేశాం. గ్రామంలో 100 శాతం పారిశుధ్యం బాగుంది.