భోపాల్: చనిపోయిన ఎద్దుకు గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లోని గణేష్గంజ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 13 ఏండ్ల ఎద్దును గ్రామస్తులు దైవంగా భావించేవారు. నంది బాబా పేరుతో దానిని ఆరాధించేవారు. అయితే పది రోజుల కిందట జరిగిన ఒక ప్రమాదంలో ఆ ఎద్దు తీవ్రంగా గాయపడింది. పశువైద్య శాలలో దానికి చికిత్స అందించగా సోమవారం చనిపోయింది.
నిజమైన నందిగా భావించే ఆ ఎద్దు మరణం గణేష్గంజ్ గ్రామస్తులను కలచివేసింది. దీంతో ఎద్దు మృతదేహాన్ని పూలతో అలంకరించారు. ట్రాక్టర్ ట్రాలీపై ఉంచి గ్రామంలో ఊరేగించారు. అనంతరం తమ అభిమాన ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు.